AP.లో ఖాళీ అధ్యాపక పోస్టుల్లో కి స్కూల్ అసిస్టెంట్ ల భర్తీ...!

*ఖాళీ అధ్యాపక*
 *పోస్టుల్లోకి స్కూల్ అసిస్టెంట్లు*

 *♦బీఈడీ, సీటీఈ, డైట్ కాలేజీలకు డిప్యుటేషన్*

*♦నేడు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్*  రాష్ట్రంలో ని(ఐసీఎస్ ఈ) బి. ఈ డి కాలేజీలు, సీటీఈ, డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఆధ్యాపక పోస్టులలో డిప్యుటే షన్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ద్వారా ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి అర్హత కల్పించారు

🌻అయితే వారి వయస్సు 2020 జూలై ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండరాదు. సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ఎంకాం/ఎంఎస్సీ పూర్తి చేసి ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ దరఖాస్తుల పరిశీలన తోపాటు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుంది. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 25 నుంచి 30 వరకూ సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించాలి. జూలై 2 నుంచి 6 వరకూ దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందిస్తారు. జూలై 7న డిప్యుటేషన్ ఆర్డర్లు జారీచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభ ద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు

🌻ఎస్సీఈఆర్ లో టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)ని బలోపేతం చేసేందుకుగాను ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యుటేషన్పై భర్తీ చేయాలని నిర్ణయించారు. అర్హులైన లెక్చరర్లు, ఐఏఎస్ట్/సీటి, జూనియర్ లెక్చరర్/లె కల్చరర్, డైట్స్, హెడ్ మాస్టర్ స్కూల్ అసిస్టెంట్లు ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి కనీసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి, 58 ఏళ్లు నిండని వారు గుర్తులు. అలాగే సంబంధిత సబ్జెక్టులో ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం పూర్తిచేసి ఎండి/ ఎంఫిల్/ పీ హెచ్డీ కలిగి ఉండాలి. అర్హులైన వారు ఈ నెల 28 నుంచి 28 వరకూ సంబంధిత ఆర్.

డీ!డీ ఈవో డైట్ ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించుకోవాలి. జూలై 6 నుంచి 10 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


0 Comments