తెలంగాణలో లో 6-8 తరగతులు ప్రారంభం
పత్రికా ప్రకటన
తేది.23-02-2021
రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, బిసి, యస్సి, యస్టి, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను వీలైన మేరకు రేపటి నుండి లేదా మార్చి 1 లోగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 6 నుండి 8 వ తరగతులకు సంబంధించి 17.24 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఉంటారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యూకేషన్ మానిటరింగ్ కమీటీలు సమావేశమై 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధ్యాయులు, విద్యార్ధుల భద్రత కోసం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను మొదటి సారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ యస్ ఏ యం రిజ్వీ, యస్సి సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, బీసి సంక్షేమ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ శ్రీధర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీమతి దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Official guidelines PDF :- Click here
0 Comments