Telangana Education Department plans to implement education teaching with corona care
కరోన జాగ్రత్తలతో విద్య బోధన అమలుకు తెలంగాణ విద్యాశాఖ యోచన
♦️ప్రత్యేకంగా హెల్త్ చెకప్ రూమ్..
️♦️డబుల్ మాస్క్, ఫేస్షీల్డు తప్పనిసరి
♦️విదేశాల్లో ఇదే పద్ధతి అమలు
➡️కరోనా మహమ్మారి కారణంగా పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. ఆన్లైన్ క్లాసుల వల్ల కంప్యూటర్లు, ఫోన్లతోనే గడిపేస్తున్నారు.
➡️ గడప దాటి బయటికెళ్తే ఎక్కడ కరోనా బారిన పడతారోన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
➡️అదేసమయం లో వారి విద్యాభ్యాసంపైనా దిగులు చెందుతున్నారు. చిన్నారుల భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు.
➡️ఈ క్ర మంలో పిల్లలను కొవిడ్ బారి నుంచి కాపాడుతూ.. వా రికి రక్షణతో కూడిన బోధన అందించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు హైదరాబాద్లోని పలు కార్పొరేట్, టెక్నో స్కూళ్లు ప్రయత్నిస్తున్నాయి.
➡️తరగతి గదుల రూపురేఖలు మార్చి, ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించి పాఠాలు చెప్పేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి.
➡️కొవిడ్ కేసులు భారీ గా తగ్గిన అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత తరగతుల పిల్లలకు గట్టి భద్రతల నడుమ క్లాస్రూమ్ బోధనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
➡️ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని పాఠశాలలు ఇదే తరహాలో పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి.
♦️అర్థం కాని ఆన్లైన్ పాఠాలు..
➡️ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు సర్కారు స్కూళ్లలో సైతం ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు.
➡️ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి60 శాతం మంది పిల్లలు పాఠాలను ఆసక్తిగా వినగా.. మిగతా 40 శాతం మంది కంప్యూటర్లు, ల్యాప్టా్పలు,స్మార్ట్ఫోన్లలో కాలక్షేపం చేసిన పరిస్థితి నెలకొంది.
డబుల్ మాస్క్, ఫేస్షీల్డు..
➡️రెండేళ్లుగా పిల్లలు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉం టుండడంతో వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి.
➡️ఈ నెల 15 తర్వాత నుంచి 2021-22 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన పక్షంలో తరగతి గది రూపురేఖలు మార్చడంపై ప్రైవేట్ విద్యాసంస్థలు దృష్టి సారించాయి.
➡️ ఒక్కో క్లాసుకు 15-20 మందిని భౌతిక దూరం పాటిస్తూ కూర్చోబెట్టడంతోపాటు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా డబుల్ మాస్క్తోపాటు ఫేస్షీల్డును ధ రించి స్కూల్కు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నా రు.
➡️ప్రతి బడిలో హెల్త్ చెకప్ రూమ్,ప్రవేశద్వారం వ ద్ద శానిటేషన్, థర్మల్ స్ర్కీనింగ్తోపాటు పిల్లలకు ప్ర త్యేకంగా గంటకోసారి హ్యాండ్ శానిటేషన్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఆలోచిస్తున్న విద్యాశాఖ..
➡️️కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్, టెక్నో స్కూళ్లు చేస్తున్న ఏర్పాట్లను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేపట్టే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
➡️ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏ ర్పాట్లను అమలు చేస్తూ పిల్లలకు బోధించడం కష్టమని, ఒకరిద్దరు పిల్లలు నిర్లక్ష్యంగా వ్యవహరించి కొవి డ్ బారిన పడితే.. వారి ద్వారా తరగతి మొత్తం వైరస్ ఉచ్చుకు చిక్కుకునే ప్రమాదముందని కొందరు అధికారులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది.
0 Comments