సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల


*సైనిక్ స్కూళ్ళ ఎంట్రన్స్ నిర్వహణ 'ఎన్ టి ఎ' కు అప్పగింత*


*సైనిక్ స్కూళ్ళలో ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను ఇక నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు.*


*గతంలో ఈ ప్రవేశ పరీక్షలను సైనిక పాఠశాలల సొసైటీనే నిర్వహించేది.* అయితే

*ఈ ఏడాది నుంచి పరీక్షల నిర్వహణ బాధ్యత ఎసీఏ స్వీకరించింది.*


*దేశవ్యాప్తంగా వున్న 33 పాఠశాలలకు ఆరు, తొమ్మిదవ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.*


*ఆరవ తరగతి ప్రవేశానికి 2021 మార్చి 31 నాటికి 12 సంవత్సరాల మధ్య వారై వుండాలి.*


*తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి అదే తేదీ నాటికి 18 ఏళ్ళ మధ్య వారై వుండాలి.*


*బాలికల కోసం అన్ని సైనిక స్కూళ్ళలోనూ ఆరవ తరగతిలో మాత్రమే ప్రవేశాలుంటాయి.*


*ఎస్సీ, ఎస్టీ లకు ప్రవేశ రుసుము రూ.400 కాగా ఇతరులందరికీ రూ.550గా నిర్ణయించారు.*


*వచ్చే ఏడాది జనవరి 10 ప్రవేశ పరీక్షలుంటాయి.*


*దరఖాస్తుకు చివరి తేదీ 2020 నవంబరు 19.*


*ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.*


*పరీక్ష రుసుము కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.*


 *పాఠశాలల వారీగా అందుబాటులో వున్న సీట్లు, రిజర్వేషన్ వివరాలు, పరీక్షా విధానాలు, పరీక్షలు జరిగే కేంద్రాలు తదితర వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇


            CLICK HERE


0 Comments